ఆచార్య నాగార్జునుడు ఎవరు? | Nagarjuna Philosophy | Mahayana Buddhism
భారతీయ తత్వ చరిత్రలో ఒక కీలక మలుపు
ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు) (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది.
ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
భారతీయ తత్వ చరిత్రలో ఒక కీలక మలుపు
అశ్వఘోషుడితో భారతదేశంలో గ్రంథ రచయిత అనే వ్యక్తిగత గుర్తింపు సాధారణ శకం 1వ శతాబ్దంలో స్పష్టంగా కనిపించింది. అతని తర్వాత భారతీయ ఆలోచనా చరిత్రలో మరింత పెద్ద మలుపు తిరిగింది. ఆ మలుపు పేరు ఆచార్య నాగార్జునుడు.
ఆచార్య నాగార్జునుడు రాజు కాదు. శిలాశాసనాలు రాయించలేదు. కావ్యాలు కూడా రాయలేదు. అతను చేసిన పని ఆలోచనలను, తర్కాన్ని మరియు విమర్శను తత్వశాస్త్ర గ్రంథాల రూపంలో రాయడం.
ఆచార్య నాగార్జునుడి కాలం
చరిత్ర పరిశోధన ప్రకారం నాగార్జునుడు సాధారణ శకం 2వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కాలం కుషాణ చక్రవర్తుల కాలం.
ఈ దశలోనే భారతదేశంలో తత్వ చర్చలు మౌఖికంగా కాకుండా గ్రంథ రూపంలో స్థిరపడ్డాయి.
నాగార్జునుడి ప్రధాన గ్రంథాలు
- మూలమధ్యమక కారిక – మధ్యమిక తత్వశాస్త్రానికి ప్రాథమిక గ్రంథం
- విగ్రహవ్యావర్తని – విమర్శలకు నాగార్జునుడు ఇచ్చిన తాత్విక సమాధానం
- యుక్తిషష్టికా – తర్కం ఆధారంగా తత్వాన్ని విశ్లేషించే రచన
- శూన్యతసప్తతి – శూన్యత సిద్ధాంతాన్ని వివరించే గ్రంథం
- వైదల్యప్రకరణ – తర్క లోపాలను గుర్తించే విమర్శాత్మక గ్రంథం
నాగార్జునుడికి ఆపాదించబడిన ఇతర గ్రంథాలు
- రత్నావళి
- సుహృల్లేఖ
- ప్రజ్ఞాపారమితాస్తవ
- ధర్మధాతుస్తవ
- బోధిచిత్తవివరణ
ఈ గ్రంథాలు తరువాతి కాలాల్లో నాగార్జునుడి పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. అతనే రాశాడని పూర్తిగా నిర్ధారణ లేదు.
నాగార్జునుడి తత్వం ఎందుకు ముఖ్యమైనది?
నాగార్జునుడి గ్రంథాల్లో దేవతల కథలు లేదా పూజా విధానాలు కనిపించవు. ఇక్కడ ప్రధానంగా కనిపించేది మనిషి ఆలోచన, తర్కం, సందేహం మరియు విమర్శ.
అందువల్ల నాగార్జునుడు కేవలం మత ప్రచారకుడు కాదు. అతను ఒక గొప్ప తత్వ రచయిత.
తెలుగు నాగార్జునుడు ఎవరు?
చరిత్రలో “తెలుగు నాగార్జునుడు” అనే వ్యక్తి గురించి ఖచ్చితమైన శాసన ఆధారం ఇప్పటివరకు లభించలేదు.
అతను మహాయాన తత్వ రచయిత నాగార్జునుడు కాదు.
తెలుగు నాగార్జునుడి రంగం
- రసవాదం
- లోహ శాస్త్రం
- సిద్ధ సంప్రదాయం
- ఆయుర్వేద ప్రయోగాలు
కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది?
- నాగార్జున అనే పేరు వేర్వేరు వ్యక్తులకు ఉండటం
- నాగార్జునకొండ ప్రాంతాన్ని తత్వ రచయితతో కలపడం
- రసవాద గ్రంథాలను అదే నాగార్జునుడికి ఆపాదించడం
ముగింపు
కుషాణ కాలపు నాగార్జునుడు మహాయాన బౌద్ధ తత్వ రచయితగా చరిత్రలో బలంగా నిర్ధారించబడ్డాడు.
తెలుగు నాగార్జునుడు మాత్రం రసవాద సంప్రదాయానికి చెందినవాడిగా గ్రంథాల ఆధారంగా మాత్రమే గుర్తించబడుతున్నాడు.
పేరు ఒకటే కానీ కాలం, రచనలు, చారిత్రక ఆధారాలు వేరు.
Collection – Rama Mohan Chinta
No comments:
Post a Comment