Showing posts with label 02.బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం. Show all posts
Showing posts with label 02.బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం. Show all posts

02.బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం

బుద్దుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం

బుద్ధుడు (563 - 483 BCE) ప్రతిత్యసముత్పాద,పటిచ్చసముప్పద (కార్యకారణత్వం ) (ఒక దాని కారణంగా మరొకటి జరగడం)

(గతి తార్కిక భౌతికవాదం )

తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం,స్వీయ ప్రభోదాన్ని పొందాడు ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు.

తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి. తన ముందు తరం యొక్క భావాల భావజాలాల నుండి భావజాలాన్ని గ్రహించి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి,తరువాత తరాల తాత్వికులకు, తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధి గా నిలిచాడు.

1. బుద్ధుని కాలము బుద్ధుని చరిత్ర
బౌద్దప్రవక్త గౌతమబుద్ధుడు. గౌతముడు క్రీస్తుపూర్వం 563 నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలోని లుంబినీలో క్షత్రియ వంశంలో జన్మించాడు. 483 లో నిర్యాణము పొందాడు. గౌతమ బుద్ధుడు శాంతి, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ దూత. బుద్ధుడు వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. అనేక ఏళ్లపాటు కఠోర తపస్సు చేసాడు. చివరకు భోది వృక్షమూలంలో కుర్చుని జ్ఞానం సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా రూపొందింది. ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు తన 29వ ఏటనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తరువాత పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణము పొందాడు.

2. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీ.పూ. 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 22 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే 'బుద్ధ గయ' అనే పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుదిశ్వాస విడిచాడు.

3. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థ గౌతమ్. అతను కపిలవస్తు రాజ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి శుద్ధోధనుడు, పాలకుడు. గౌతమ్ తల్లి మాయా దేవి అతనికి జన్మనిచ్చిన వెంటనే మరణించింది. అతను విశాలమైన మనస్సుతో ఆలోచించే పిల్లవాడు. అతను చాలా క్రమశిక్షణ గలవాడు మరియు సమకాలీన భావనలను అర్థం చేసుకోవడానికి మరియు మరింత జ్ఞానాన్ని సేకరించడానికి ప్రశ్నించడానికి ఇష్టపడేవాడు. అతను తన జీవితాన్ని ఆధ్యాత్మికత మరియు ధ్యానం కోసం అంకితం చేయాలనుకున్నాడు. ఇది అతని తండ్రికి నచ్చలేదు. అతను ఆధ్యాత్మికతను కనుగొనడానికి తన తండ్రి కోరికలకు విరుద్ధంగా వెళ్ళాడు. అతను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, గౌతమ్ అద్భుతమైన అందం కలిగిన యువరాణి యశోధరను వివాహం చేసుకున్నాడు. వారికి 'రాహుల్' అనే కొడుకు ఉన్నాడు. సిద్ధార్థ కుటుంబం పూర్తి మరియు సంతోషంగా ఉన్నప్పటికీ, అతనికి శాంతి లేదు. గోడలకు అవతల ఉన్న సత్యాన్ని వెతకాలని అతని మనస్సు ఎల్లప్పుడూ అతనిని కోరింది.

బౌద్ధ వ్రాతప్రతుల ప్రకారం, సిద్ధార్థ ఒక వృద్ధుడిని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మరియు శవాన్ని చూసినప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అతను అర్థం చేసుకున్నాడు. అతను తన కుటుంబాన్ని, సింహాసనాన్ని మరియు రాజ్యాన్ని వదిలి అడవుల్లో తిరుగుతూ నిజమైన సత్యాన్ని మరియు జీవిత ఉద్దేశాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. అతను 6 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని అంతిమ సత్యాన్ని గ్రహించాడు. అది బీహార్‌లోని బోద్‌గయాలో జరిగింది. అతను 35 ఏళ్లు నిండి, జ్ఞానోదయం పొందాడు. ఆ చెట్టుకు బోధి వృక్ష అని పేరు పెట్టారు. సారనాథ్‌లో జ్ఞానోదయం గురించి తన మొదటి ప్రసంగం చేశాడు.

బుద్దుడు దుఃఖాన్ని, అసలు కారణాన్ని కనుగొన్నాడు. దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే అవిద్యను లేక అజ్ఞానాన్ని తొలగించాలన్నాడు. అవిద్యను నిర్ములించడానికి అష్టాంగమార్గమే సరైనదని బుద్దుడు భోదించాడు.