తత్వ చింతన నరసింహ శతకం పద్యం

నరసింహ శతకం పద్యం | శేషప్ప కవి | తత్వ చింతన

📜 నరసింహ శతకం పద్యం

పద్యం:

సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బిందెప్పడో విడుచుట యెఱుకలేదు, శేషప్ప కవి శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని, నమ్మరాదా మాటనెమ్మనమున బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో, యూరనో, యడవినో, యుదకమధ్యముననో యెప్పుడో యేవేళ నే క్షణంబొ? తే|| మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన దేహమున్నంతలో మిమ్మును దెలియవలయు భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
వివరణ:

ఈ పద్యం జీవితం యొక్క అనిత్యతను స్పష్టం చేస్తుంది. మనిషి ఎప్పుడు, ఎక్కడ, ఏ వయస్సులో మరణిస్తాడో ఎవరికీ తెలియదు. అందువల్ల మనం బ్రతికున్నంత కాలం జ్ఞానం, ధర్మం, సత్యాన్ని తెలుసుకొని జీవించాలి అనే సందేశాన్ని ఈ పద్యం ఇస్తుంది.
రచయిత గురించి:

ఈ నరసింహ శతకాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి రచించారు. తెలుగు శతక సాహిత్యంలో ఇది ఒక ప్రముఖ కృతి. ఈ శతకంలోని ప్రతి పద్యం చివర “భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” అనే మకుటంతో ముగుస్తుంది.

No comments:

Post a Comment